Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెలగపండు గుజ్జును నేతిలో వేయించి....?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (11:27 IST)
కడుపులో యాసిడ్లు అతిగా పేరుకుపోయి, తీసుకున్న ఆహారం జీర్ణంకాక పోతున్నప్పుడు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూ చాలా బాధను కలిగిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఈ కింది చిట్కాల్లో చూసి తెలుసుకుందాం..
 
1. ఎండిన ఉసిరికాయలలో గింజలు తీసేసి, పిప్పళ్ళనూ, శొంఠిని విడివిడిగా నేతిలో వేయించి, మూడింటినీ సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి, కొంచెం పంచదార కలుపుకుని శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఓ చెంచా తీసుకుని కొంచెం తేనెలో కలిపి తింటే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. పొడిని మజ్జిగలో కూడా వేసుకుని తీసుకోవచ్చును.
 
2. యష్టిచూర్ణం ఆయుర్వేద మందుల షాపులో, నేరుగా దొరుకుతుంది. దీన్ని అరచెంచా తీసుకుని కొంచెం తేనెలో కలిపి రెండు మూడు గంటలకోసారి తీసుకోవాలి. 
 
3. వెలగపండు గుజ్జును నేతిలో వేయించి దంచి, రసంతీసి, తేనెగానీ, పంచదార కలిపిగానీ తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 
 
4. ఎండుఖార్జరం, ఎండుద్రాక్ష, నేతిలో వేయించిన పిప్పళ్ళపొడి, పంచదార ఇవన్నీ సమభాగాలుగా దంచి, తేనెతో కలిపి అరచెంచా మోతాదులో రోజూ రెండుమూడుసార్లు తీసుకుంటుంటే పైత్యం తగ్గించి, ఎక్కిళ్ళు రాకుండా అరికడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments