Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెలగపండు గుజ్జును నేతిలో వేయించి....?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (11:27 IST)
కడుపులో యాసిడ్లు అతిగా పేరుకుపోయి, తీసుకున్న ఆహారం జీర్ణంకాక పోతున్నప్పుడు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూ చాలా బాధను కలిగిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఈ కింది చిట్కాల్లో చూసి తెలుసుకుందాం..
 
1. ఎండిన ఉసిరికాయలలో గింజలు తీసేసి, పిప్పళ్ళనూ, శొంఠిని విడివిడిగా నేతిలో వేయించి, మూడింటినీ సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి, కొంచెం పంచదార కలుపుకుని శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఓ చెంచా తీసుకుని కొంచెం తేనెలో కలిపి తింటే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. పొడిని మజ్జిగలో కూడా వేసుకుని తీసుకోవచ్చును.
 
2. యష్టిచూర్ణం ఆయుర్వేద మందుల షాపులో, నేరుగా దొరుకుతుంది. దీన్ని అరచెంచా తీసుకుని కొంచెం తేనెలో కలిపి రెండు మూడు గంటలకోసారి తీసుకోవాలి. 
 
3. వెలగపండు గుజ్జును నేతిలో వేయించి దంచి, రసంతీసి, తేనెగానీ, పంచదార కలిపిగానీ తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 
 
4. ఎండుఖార్జరం, ఎండుద్రాక్ష, నేతిలో వేయించిన పిప్పళ్ళపొడి, పంచదార ఇవన్నీ సమభాగాలుగా దంచి, తేనెతో కలిపి అరచెంచా మోతాదులో రోజూ రెండుమూడుసార్లు తీసుకుంటుంటే పైత్యం తగ్గించి, ఎక్కిళ్ళు రాకుండా అరికడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

తర్వాతి కథనం
Show comments