వెలగపండు గుజ్జును నేతిలో వేయించి....?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (11:27 IST)
కడుపులో యాసిడ్లు అతిగా పేరుకుపోయి, తీసుకున్న ఆహారం జీర్ణంకాక పోతున్నప్పుడు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూ చాలా బాధను కలిగిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఈ కింది చిట్కాల్లో చూసి తెలుసుకుందాం..
 
1. ఎండిన ఉసిరికాయలలో గింజలు తీసేసి, పిప్పళ్ళనూ, శొంఠిని విడివిడిగా నేతిలో వేయించి, మూడింటినీ సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి, కొంచెం పంచదార కలుపుకుని శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఓ చెంచా తీసుకుని కొంచెం తేనెలో కలిపి తింటే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. పొడిని మజ్జిగలో కూడా వేసుకుని తీసుకోవచ్చును.
 
2. యష్టిచూర్ణం ఆయుర్వేద మందుల షాపులో, నేరుగా దొరుకుతుంది. దీన్ని అరచెంచా తీసుకుని కొంచెం తేనెలో కలిపి రెండు మూడు గంటలకోసారి తీసుకోవాలి. 
 
3. వెలగపండు గుజ్జును నేతిలో వేయించి దంచి, రసంతీసి, తేనెగానీ, పంచదార కలిపిగానీ తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 
 
4. ఎండుఖార్జరం, ఎండుద్రాక్ష, నేతిలో వేయించిన పిప్పళ్ళపొడి, పంచదార ఇవన్నీ సమభాగాలుగా దంచి, తేనెతో కలిపి అరచెంచా మోతాదులో రోజూ రెండుమూడుసార్లు తీసుకుంటుంటే పైత్యం తగ్గించి, ఎక్కిళ్ళు రాకుండా అరికడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?

వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments