Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతాఫలం గుజ్జును ఇలా చేస్తే..?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (16:52 IST)
సీతాఫలం చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. కానీ, కొందరైతే ఈ కాలంలో దీనిని తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయని అంటారు.  ఆయుర్వేదం ప్రకారం ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. దీనిలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక తీసుకోవాలనిపిస్తుంది.. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..
 
1. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తప్రసరణకు చాలా మంచివి. రోజూ కాకపోయినా వారంలో ఒకటి లేదా రెండుసార్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. 
 
2. సీతాఫలం గింజలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. రోజూ మీరు తీసుకునే ఆహారంలో కొద్దిగా ఈ పొడిని కలిపి తీసుకుంటే కడుపులోని పురుగులు తొలగిపోతాయి. 
 
3. సీతాఫలంలోని గుజ్జును తీసి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. సీతాఫలం గింజలను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది. 
 
4. సీతాఫలం తొక్కలను ఎండబెట్టుకుని పొడి చేసుకుని ఓ బాటిల్లో నిల్వచేసుకోవాలి. రోజూ మీరు చేసుకునే కూరల్లో ఈ పొడిని సేవిస్తే అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
5. కొంతమందికి పళ్లు తోముకునేటప్పుడు దంతాల నుండి రక్తం కారుతుంది. అలాంటప్పుడు సీతా గింజల పొడిని ఉపయోగించి పళ్లు తోముకుంటే దంతాలు దృఢంగా మారుతాయి.  

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments