అలా చేస్తే శరీరం దేనికీ పనికిరాదు.. అందుకే ఈ చిట్కాలు...

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (12:21 IST)
ఇప్పుటి కాలంలో ఏ చిన్న అనారోగ్య సమస్య ఎదురైనా వెంటనే ఆసుపత్రికి లేదా మెడికల్‌ షాపుకి వెళ్లి మందులు, ఏవేవో మాత్రలు తెచ్చుకుంటారు. అది ఒకరోజుకైతే పర్వాలేదు కానీ.. కొన్ని వారాలు, నెలలు పాటు వాడితే శరీరం దేనిని పనికిరాదు. శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చిన దానిని తట్టుకునే శక్తి ఉండాలి. అప్పుడే ఏ మందులు, మాత్రలు అవసరం మనకుండదు. అందుకు ముందుగా ఏం చేయాలంటే.. మంచి పుష్టికరమైన ఆహారాన్ని భుజించాలి. అలాంటి వాటిల్లో ఈ కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం...
 
1. చింతపండు చారు వాత రోగాలను దరిచేరకుండా చేస్తుంది. జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. పెసలను పద్నాలుగు రెట్ల నీటిలో వేసి బాగా ఉడికించి తాలింపుచేస్తే పెసరకట్టు అవుతుంది. ఇది మంచి బలాన్నిస్తుంది. సులువుగా జీర్ణమవుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది.
 
2. ఉలవచారు మూలవ్యాధిని తగ్గిస్తుంది. కఫ, వాత వ్యాధులను నివారిస్తుంది. శెనగకట్టు పైత్య, కఫ రోగాలను నివారిస్తుంది. అడవి పెసలతో చేసిన కట్టు పైత్య, శ్లేష్మవ్యాధులను అరికడుతుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. తరచుగా వచ్చే పొడి దగ్గును తగ్గిస్తుంది. 
 
3. చిన్న శెనగలతో చేసిన కట్టు శరీరానికి పుష్టి కలిగిస్తుంది. మధుమేహవ్యాధిని అదుపులో ఉంచుతుంది. కందికట్టు వాతవ్యాధులను త్వరగా నివారిస్తుంది. పైత్యం, కఫం, జ్వరం, మొలలను అరికడుతుంది.
 
4. మినపప్పు, అలచందపప్పు వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. వాత వ్యాధులను హరించి, మంచి బలాన్ని చేకూరుస్తాయి. అనుముల పప్పు రక్తపిత్తమును తగ్గిస్తుంది. స్త్రీలలో పాలనువృద్ధి చేస్తుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments