Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్య ప్రయోజనాలకు ఆయుర్వేద మూలికలు

Webdunia
సోమవారం, 18 జులై 2022 (21:43 IST)
ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలు శతాబ్దాలుగా భారతీయ సాంప్రదాయ వైద్యంలో అంతర్భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. డయాబెటిస్, గుండె జబ్బుల నుండి రక్షణతో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఆయుర్వేద మూలికలు మూలమవున్నాయి. అందువల్ల ఈ మూలికలు, సుగంధాలను కొద్దిమొత్తంలో జోడించడం వలన భోజనానికి రుచి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి.

 
పవిత్ర తులసి అంటువ్యాధులతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెంతులు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది.

 
జీలకర్ర అనేది సాధారణంగా భోజనానికి రుచిని జోడించడానికి ఉపయోగించే ఒక ఆయుర్వేద మసాలా. ఇది టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులను దరిచేరకుండా చూస్తుంది. దాల్చిన చెక్క పొడితో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు మాయం చేస్తుంది.

 
కరివేపాకును పచ్చడిగానో లేదా విడిగానో తీసుకోవచ్చను. అలాకాకుంటే కరివేపాకు రసాన్ని మజ్జిగలో కలుపుకుని రోజూ తాగితే జీర్ణాశయం చక్కగా పని చేస్తుంది. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది నుండి పదిహేను కరివేపాకులను నమిలి తినాలి. ఇలా నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మధుమేహ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. 

 
కడుపులో వికారంగా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నపుడు.. రెండు చెంచాల కరివేపాకు రసంలో కొద్దిగా నిమ్మరసం, పంచదార కలిపి తీసుకుంటే ఇలాంటి సమస్యల రావు. కరివేపాకు బాగా ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి సేవిస్తే విరోచనాలు తగ్గుతాయి. కాలిన గాయాల మీద కరివేపాకు నూరి కట్టుకడితే గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. 

 
కరివేపాకు రసాన్ని పురుగులు కుట్టిన ప్రాంతాల్లో రాసుకుంటే దద్దుర్లు తగ్గిపోతాయి. కరివేపాకును ముద్దగా నూరి, చెంచాడు ముద్దను గ్లాస్ మజ్జిగలో కలిసి తీసుకుంటే కడుపులో వికారాన్ని నివారించవచ్చు. గర్భవతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

తర్వాతి కథనం
Show comments