Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం తాంబూలం తింటే..? ఎప్పుడు తినకూడదో తెలుసా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (14:48 IST)
భోజనం చేసిన తరువాత.. అగరువత్తుల పొగవలన, కారం చేదు, వగరు కలిగిన ఫలరసముల వలనగానీ, వక్క, కస్తూరి, లవంగం, జాజికాయగానీ, తాంబూలముగానీ తీసుకోవడం వలన భోజనం వలన కలుగు కఫదోషములు తొలగిపోతాయి. మరికొన్ని ఆరోగ్య ఆయుర్వేద చిట్కాలు..
 
1. నిద్రలేచినప్పుడు, స్నానం చేసినపుడు, భుజించిన తరువాత, వాంతి అయినపుడు తాంబూలము వేసుకొనవచ్చును. తాంబూలంలో కారం, తీపి, వగరు, చేదు కలిగి ఉంటాయి. వీటి వలన వాత, కఫ వ్యాధులు దరిచేరవు. నోటియందు క్రిములు నశిస్తాయి. నోటిదుర్గంధము తొలగిపోతుంది. కామోద్దీపనము కలిగించును.
 
2.  తాంబూలంలో వాడు కాచు.. కఫ, పిత్తములను, సున్నము, వాతమును హరించగలవు. కాబట్టి... ఈ మూడు దోషములు తాంబూలము వలన పోవును. ఉదయాన్నే వక్క ఎక్కువగానూ, మధ్యాహ్నం.. కాచు ఎక్కువగానూ, రాత్రులు సున్నము ఎక్కువగానూ ఉండేలా తాంబూలాన్ని తయారుచేసుకోవాలి.
 
3. తాంబూలము నమిలేటపుడు... మొదటి జనించు రసం విషతుల్యమగును. రెండవసారి జనించు రసం అజీర్ణమునకు కారణమగును. మూడవసారి జనించే రసం అమృతతుల్యమగును. కాబట్టి తాంబూలం వేసికున్న తరువాత మొదటి రసాలను ఉమ్మివేస్తూ చివరి రసాలను మాత్రమే మ్రింగుట ఆరోగ్యకరం.
 
4. దంత పటుత్వం లేనివారు.. నేత్రరోగములు, విషము, మదుము, మూర్చ, గాయములు, రక్తపిత్తములు గల రోగములు గలవారు తాంబూలము సేవించరాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments