పచ్చి పసుపులో ఆవు పెరుగు కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (10:06 IST)
ఆంధ్రుల సంస్కృతిలో, ఆచార వ్యవహారాల్లో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పసుపు మంగళకరమైనది. మన రోజువారి ఆహారంలో పసుపు ఒక భాగంగా నిల్చిపోయింది. శుభకార్యాల్లో పసుపును కాళ్ళకు, ముఖానికి రాసుకోవడం మంగళప్రదంగా భావిస్తారు. మన ఆంధ్రదేశ్ వనితలు, దీనిని తెలుగులో పసుపు, సంస్కృతిలో హరిద్రా అని పిలుస్తారు. 
 
1. పసుపు, చందనం రెండింటిని పాలమీద మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకుని తరువాత చన్నీళ్ళతో శుభ్రంగా కడిగిన ముఖ వర్చస్సు పెరుగుతుంది. శరీర కాంతి ఇనుమడిస్తుంది.
 
2. పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
3. దాదాపు 10 గ్రాముల పచ్చి పసుపు 20-40 గ్రాముల ఆవు పెరుగు నందు కలిపి ఉదయం సేవించినచో కామెర్లు తగ్గుతాయి. ఆహారం కారం, పులుపు, మసాల వస్తువులు ఇవ్వకూడదు.
 
4. పసుపు, వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయమవుతాయి. 
 
5. పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకుని దీర్ఘకాలంగా ఉన్న ప్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. 
 
6. పసుపు, తులసి ఆకుల రసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

Virosh Reception: విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

తర్వాతి కథనం
Show comments