Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి పసుపులో ఆవు పెరుగు కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (10:06 IST)
ఆంధ్రుల సంస్కృతిలో, ఆచార వ్యవహారాల్లో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పసుపు మంగళకరమైనది. మన రోజువారి ఆహారంలో పసుపు ఒక భాగంగా నిల్చిపోయింది. శుభకార్యాల్లో పసుపును కాళ్ళకు, ముఖానికి రాసుకోవడం మంగళప్రదంగా భావిస్తారు. మన ఆంధ్రదేశ్ వనితలు, దీనిని తెలుగులో పసుపు, సంస్కృతిలో హరిద్రా అని పిలుస్తారు. 
 
1. పసుపు, చందనం రెండింటిని పాలమీద మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకుని తరువాత చన్నీళ్ళతో శుభ్రంగా కడిగిన ముఖ వర్చస్సు పెరుగుతుంది. శరీర కాంతి ఇనుమడిస్తుంది.
 
2. పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
3. దాదాపు 10 గ్రాముల పచ్చి పసుపు 20-40 గ్రాముల ఆవు పెరుగు నందు కలిపి ఉదయం సేవించినచో కామెర్లు తగ్గుతాయి. ఆహారం కారం, పులుపు, మసాల వస్తువులు ఇవ్వకూడదు.
 
4. పసుపు, వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయమవుతాయి. 
 
5. పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకుని దీర్ఘకాలంగా ఉన్న ప్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. 
 
6. పసుపు, తులసి ఆకుల రసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments