Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులతో పందెం వేసి ఓడిపోయాడు.. డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. తన స్నేహితులతో కలిసి క్రికెట్ పందెం కాసిన ఓ యువకుడు.. ఓ పందెంలో ఓడిపోవడంతో స్నేహితులకు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నార్లగూడ తండాలో గురువారం వెలుగుచూసింది. 
 
పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన అంగోతు అమర్, సువర్ణ అనే దంపతులు దిన కూలీలు. వీరి రెండో కుమారుడు ప్రకాశ్(19) ఇంటర్ చదివి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో పంజాబ్ గెలుస్తుందని ప్రకాశ్ తన స్నేహితులతో వేలాది రూపాయల్లో బెట్టింగ్ కాశాడు.
 
కానీ, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఉదయానికల్లా డబ్బులు చెల్లించాలని స్నేహితులు పట్టుబట్టారు. డబ్బులెలా చెల్లించాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన ప్రకాశ్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. పందెం తమ కుమారుడిని బలిదీసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతనితో పందెం వేసిన స్నేహితులెవరు? ఎంతమేరకు పందెం కట్టారనే విషయాలపై ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో సీఐ నవీన్ కుమార్ విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments