Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులతో పందెం వేసి ఓడిపోయాడు.. డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. తన స్నేహితులతో కలిసి క్రికెట్ పందెం కాసిన ఓ యువకుడు.. ఓ పందెంలో ఓడిపోవడంతో స్నేహితులకు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నార్లగూడ తండాలో గురువారం వెలుగుచూసింది. 
 
పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన అంగోతు అమర్, సువర్ణ అనే దంపతులు దిన కూలీలు. వీరి రెండో కుమారుడు ప్రకాశ్(19) ఇంటర్ చదివి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో పంజాబ్ గెలుస్తుందని ప్రకాశ్ తన స్నేహితులతో వేలాది రూపాయల్లో బెట్టింగ్ కాశాడు.
 
కానీ, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఉదయానికల్లా డబ్బులు చెల్లించాలని స్నేహితులు పట్టుబట్టారు. డబ్బులెలా చెల్లించాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన ప్రకాశ్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. పందెం తమ కుమారుడిని బలిదీసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతనితో పందెం వేసిన స్నేహితులెవరు? ఎంతమేరకు పందెం కట్టారనే విషయాలపై ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో సీఐ నవీన్ కుమార్ విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments