Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు ప్రారంభం

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:27 IST)
గుంటూరు కలెక్టరేట్లో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొనడం జరిగింది. అర్హులైన రబీ రైతులందరికీ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వారి వారి ఖాతాల్లో మంగళవారం నగదు జమ చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లా అధికారులు నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ హోం మినిస్టర్ మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా వ్యవసాయధికారి, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్ వడ్డీ లేని రుణాల పథకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేసారన్నారు. దాదాపు 6 లక్షల 28 వేల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 
 
రబీ సీజన్‌లో లక్ష లోపు పంటరుణాలు తీసుకొని ఏడాది లోపు చెల్లించిన రైతులకు ఈ పథకం కింద నగదు జమ అవుతుందన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద దాదాపు 128 కోట్ల రూపాయలు జమ కానున్నాయని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని సీఎం గారు చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments