Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్‌లో వైకాపా అభ్యర్థి ఘన విజయం

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (12:17 IST)
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. అయితే, ఈ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి డాక్టర్‌ దాసరి సుధ విజ‌యం ఖ‌రారైంది. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి వైసీపీకి మొత్తం 84,682 ఓట్లు, బీజేపీకి 16,190 ఓట్లు వ‌చ్చాయి. అలాగే, కాంగ్రెస్‌కు 5,026 ఓట్లు, నోటాకు 2,830 ఓట్లు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.
 
ఎనిమిదో రౌండ్‌లో వైసీపీకి 9,691 ఓట్లు, బీజేపీకి 1,964 ఓట్లు, కాంగ్రెస్‌కు 774, నోటాకు 364 ఓట్లు ద‌క్కాయి. ఎనిమిది రౌండ్లు ముగిసే స‌రికే వైసీపీ 68,492 ఓట్ల ఆధిక్యంలో ఉండ‌డంతో ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. ఓట్ల లెక్కింపు తుది ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే పూర్తి ఆధిక్యంలో సుధ ఉండ‌డంతో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు మొద‌లు పెట్టారు.
 
అంతకుముందు ఏడో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 60,785 మెజారిటీ సాధించారు. ఏడో రౌండ్ లో ఆమెకు 8,741 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆమెకు ఏడు రౌండ్లు కలిపి 74,991 ఓట్లు పోలయ్యాయి.
 
బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కు 14,165 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కమలమ్మ 4,252 ఓట్లు సాధించారు. కాగా, ఈ ఏడాది మార్చిలో బద్వేల్ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments