ఏపీ శాసన మండలిలో మారిన సమీకరణాలు : ఆధిక్యంలో వైకాపా

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలు తారుమారయ్యాయి. శుక్రవారం నుంచి వైసీపీ బలం పెరగనుంది. నేటితో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీల బలం తగ్గనుంది. 
 
ఫలితంగా మండలిలో టీడీపీ బలం 22 నుంచి 15కి తగ్గుతుంది. అదేసమయంలో వైసీపీ బలం 20కి చేరనుంది. ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులను గవర్నర్ నేరుగా మండలికి నామినేట్ చేయడం తెలిసిందే. ఇక, వైసీపీ సీనియర్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీకాలం కూడా రేపటితో ముగియనుంది.
 
తాజా పరిణామాలతో అసెంబ్లీ, శాసనమండలి రెండింట్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనుంది. ఇప్పటివరకు మండలిలో తనకున్న బలంతో టీడీపీ పలు బిల్లులను అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగి, టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఇకపై ఆ పరిస్థితి కనిపించకపోవచ్చు.
 
పదవీ విరమణ చేయనున్న ఎనిమిది మంది సభ్యుల్లో ఏడుగురు టీడీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, జగదీశ్వర్ రావు, వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల బలం 21కి పెరగనుండగా... టీడీపీ సభ్యుల సంఖ్య 15కు తగ్గనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments