Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తక్షణ రాష్ట్రపతి పాలన విధించండి : వైకాపా రెబెల్ ఎంపీ డిమాండ్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (17:48 IST)
వైకాపా పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపత పాలన విధించాలని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం లోక్‌సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం 377 నిబంధన కింద లోక్‌సభలో లిఖితపూర్వకంగా నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్త వ్యస్తంగా మారిందని ఆయన ఆరోపించారు. 
 
అప్పుల కోసం ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెడుతుందన్నారు. నిజానికి ఏపీలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు  సైతం వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. 
 
కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, అందువల్ల తక్షణం రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments