చిటికేసి చెబుతున్నా... అధైర్యపడొద్దు... ఎవరూ ఏం పీకలేరు : వైకాపా ఎంపీ

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (15:47 IST)
రాష్ట్ర ప్రజలకు అధికార వైకాపాకు చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు ధైర్య వచనాలు చెప్పారు. ఏ ఒక్కరూ భయపడొద్దనీ, చిటికేసి చెబుతున్నా ఎవరూ ఏం చేయలేరని అన్నారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేస్తే డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యులకు ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడమేంటని నిలదీశారు. నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా, మృధుభాషిగా డాక్టర్ గంగాధర్‌కు పేరుందని రాజు గుర్తుచేశారు. 
 
అలాగే, చిత్తూరులో 'ఓ దళిత యువకుడు మద్యం దందాపై మాట్లాడితే.. ఆ వ్యక్తిని సాక్షాత్ ఓ మంత్రి అనుచరులు, వైకాపా కార్యకర్తలు చంపుతామని బెదిరించారని వార్తలు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రాణాలు తీసుకోవడం బాధాకరం దయచేసి అందరూ ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
అంతేకాకుండా, నాకూ బెదిరింపులు వస్తున్నాయి. ఎవరూ చలించకండి. ఎవర్నీ ఎవరూ ఏమీ చేయలేరు. ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదు. నన్ను సోషల్ మీడియాలో ఓ మహిళా మూర్తి రకరకాలుగా మాట్లాడారు. ఆడవాళ్లు మాట్లాడాల్సిన మాటలే కావవి. ఎన్నిరకాలుగా ఏం చేసినా.. ఏం ప్రయోజనం లేదని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments