Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి : అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఇందులోభాగంగా అధికార వైకాపా పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇందులో స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లు ఉన్నాయి. మొత్తం 18 స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 4, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే, 
 
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీలుగా పోటీ చేసే అభ్యర్థులు వీరే... 
ఎస్. మంగమ్మ (అనంతపురం, బీసీ బోయ). డాక్టర్ మధుసూదన్ (కర్నూలు, బీసీ బోయ), రామసుబ్బారెడ్డి (కడప, ఓసీ రెడ్డి), డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు బీసీ వెన్నెరెడ్డి), మేరుగ మురళీధర్ (నెల్లూరు, ఎస్సీ మాల), కావూరి శ్రీనివాస్ (వెస్ట్ గోదావరి, బీసీ శెట్టిబలిజ), పంకా రవీంద్రనాథ్ (వెస్ట్ గోదావరి, ఓసీ కాపు), కుడిపూడి సూర్యనారాయణ (ఈస్ట్ గోదావరి, బీసీ శెట్టిబలిజ), సత్తు రామారావు (శ్రీకాకుళం, బీసీ యాదవ)లు ఉన్నారు. 
 
ఎమ్మెల్యే కోటాలో ఏసురత్నం (గుంటూరు బీసీ వడ్డెర), మర్రి రాజశేఖర్ (గుంటూరు, ఓసీ కమ్మ), జయమంగళ వెంకటరమణ (వెస్ట్ గోదావరి, బీసీ వడ్డెర), బొమ్మి ఇజ్రాయిల్ (ఈస్ట్ గోదావరి, ఎస్సీ మాదిక), కోలా గురువులు (విశాఖ, బీసీ వడబలిజ), పోతుల సునీత (ప్రకాశం, బీసీ పద్మశాలి), పెన్మత్స సూర్యనారాయణ రాజు (విజయనగరం, ఓసీ, క్షత్రియ). 
 
గవర్నర్ కోటాలో కర్రి పద్మశ్రీ (బీసీ, మత్స్యకార), కుంభా రవి (అల్లూరి జిల్లా, ఎస్టీ ఎరుకల)లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments