Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ తీర్థం పుచ్చుకున్న సి. రామచంద్రయ్య.. జగన్‌పై ఫైర్

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (22:27 IST)
CBN
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఆయన నివాసంలో రామచంద్రయ్య కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. 
 
సి.రామచంద్రయ్యతో పాటు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాథ రెడ్డి, పలువురు కడప జిల్లాకు చెందిన కీలక నేతలు సైకిలెక్కేశారు.
 
టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన సి. రామచంద్రయ్య.. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవన్నారు.
 
కాగా.. గతంలో కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం అయిన తర్వాత సి. రామచంద్రయ్య ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇప్పుడు టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. రామచంద్రయ్య తొలుత చార్టర్డ్ అకౌంటెంట్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎదగగలిగారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన పెద్ద నాయకుల్లో రామచంద్రయ్య ఒకరు. జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సి. రామచంద్రయ్య కూడా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments