Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులు శూన్యం : వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (08:36 IST)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ద్వారా సంక్రమించిన హక్కుల కారణంగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్న కొందరు వైకాపా ప్రజాప్రతినిధులు నోటిదూలను ప్రదర్శిస్తున్నారు. చరిత్రపై ఏమాత్రం అహగాన లేని వారిలా మాట్లాడుతున్నారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులేమీ లేవన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వల్లే మనకు సంపూర్ణ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. 
 
తాడికొండ వైకాపా ఎమ్మెల్యేగా ఈమె కొనసాగుతున్నారు. గురువారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అంబేద్కర్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు పెను రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇందులో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ వల్ల మనకు వచ్చిందేమీ లేదన్నారు. ఆయన వల్ల మనకు వచ్చిన హక్కులు ఏమీ లేవన్నారు. 
 
బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మనకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. మరోవైపు, అంబేద్కర్ అభిమానులను ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments