Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప సూసైడ్ : ఎమ్మెల్యే రోజా

ఆ కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే ప్రభుత్వ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఫ్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంగా పీలేరుకు చెందిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం త

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (16:50 IST)
ఆ కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే ప్రభుత్వ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఫ్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంగా పీలేరుకు చెందిన  ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, ఈ అమ్మాయి కూడా కులపిచ్చి రాక్షసుల వల్లే చనిపోయిందన్న విషయం స్పష్టంగా అర్థమౌతోందన్నారు.
 
గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఓ మహిళకు రక్షణ లేకపోవడం దారుణమని.. పరిపాలనా లోపమని అన్నారు. ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ చేసి నిందితులను శిక్షించి ఉంటే శిల్పకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. 
 
పాఠాలు బోధించాల్సిన గురువులే డాక్టర్ శిల్పపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా ప్రయోజం లేకుండా పోయిందని ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైందన్నారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీలో సభ్యులు ఈ జిల్లాకు చెందిన వారే ఉంటారని, వాళ్లందరూ ఈ ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో మహిళల అక్రమ రవాణా, వేధింపులు, ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ నంబర్‌గా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం