Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెళ్లేవారు వెళ్ళిపోనివ్వండి.. ఎవరిష్టం వారిది : నేతలతో మాజీ సీఎం జగన్

వరుణ్
గురువారం, 4 జులై 2024 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో వైకాపా ఎక్కువగా సంఖ్యాబలం ఉంది. ఇపుడు వైకాపా అధికారం కోల్పోవడంతో పెక్కుమంది ఎమ్మెల్సీలు టీడీపీ లేదా జనసేన, బీజేపీల్లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసిన పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ, 'వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. ఇప్పుడూ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం. ఇబ్బందేమీ లేదు' అంటూ నైరాశ్యంతో వ్యాఖ్యానించారు. 
 
'శాసనమండలిలో వైకాపాకు సంఖ్యా బలం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చు, ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయి' అని పార్టీ నేతలతో జగన్ అన్నారు. ఈ మాటలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. దీనిపై జగన్ స్పందిస్తూ, 'గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వాళ్లలో ఎంత మంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు? అటూ ఇటూ వెళ్లేవారు ఎటూ కాకుండా పోతారు. ఎవరిష్టం వారిది' అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా.. వెనక్కి తగ్గకూడదు, మళ్లీ ముందుకు కదలాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments