Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం!!

వరుణ్
గురువారం, 4 జులై 2024 (09:11 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. తొలుత ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశమవుతారు. ఇందుకోసం ఆయన బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానితో సమావేశంకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సీఎం రేవంత్‌కు అపాయింట్మెంట్ ఇచ్చింది. అయితే, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ప్రధానితో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపే సమావేశాల్లో తమతమ రాష్ట్రాల్లోని సమస్యలను ఏకరవు పెట్టనున్నారు. ముఖ్యంగా, విభజన హామీలను తక్షణం అమలు చేయాలని, విభజన సమస్యలను పరిష్కరించాలని వారు కోరనున్నారు. 
 
తెలంగాణ సీఎం మాత్రం గత వారమే ప్రధానితో భేటీ కావాల్సి వుంది. కానీ, లోక్‌సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదాపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఈ భేటీ జరుగనుంది. తెలంగాణాకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావల్సిన అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 
 
ముఖ్యంగా, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలం పాటల్లో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం, సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం, విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉండిపోయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన వర్శిటీకి నిధుల కేటాయింపు తదితర అంశాలను ప్రధాని దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లనున్నారు. ఇదిలావుంటే, శనివారం నాడు హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments