హెలికాఫ్టర్ దెబ్బకు ఫ్యాన్ బెంబేలు... గుర్తు మార్చాల్సిందేనంటూ వైకాపా డిమాండ్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (20:44 IST)
ప్రజాశాంతి పార్టీ హెలికాఫ్టర్ గుర్తును చూసి వైకాపా నేతలు బెంబేలెత్తిపోతున్నారు. హెలికాఫ్టర్ గుర్తు, తమ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్ గుర్తు ఒకేలా ఉన్నాయనీ, అందువల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రజాశాంతి గుర్తును మార్చాలని వైకాపా నేతలు కోరుతున్నారు. 
 
అలాగే, ఏపీలో అధికారులు వ్వహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందచేశారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను విధుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వివిధ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోనందున మరోసారి కలిశామని ఆ పార్టీ నేతలు చెప్పారు. 
 
టీడీపీకి అనుకూలంగా పని చేసే విధంగా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు వాహనాల్లోనే డబ్బును నియోజకవర్గాలకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీకి కేంటాయించిన హెలిక్యాప్టర్ గుర్తును మార్చమని కోరినట్టు ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments