చంద్రబాబు కారుపై బాంబుతో దాడిచేస్తాం : వైకాపా నేత

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:31 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం వస్తే ఆయన కారుపై బాంబుతో దాడి చేస్తామంటూ వైకాపా నేత, రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయంతెల్సిందే. ఒకరు ఒక మాటంటే.. తామేం వాళ్లకు తక్కువేం కాదని రెచ్చిపోయి మరీ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. 
 
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టగా దీనికి పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్ష చేపట్టింది. దీక్షాస్థలి నుంచి కూడా అటు టీడీపీ నేతలు ఇటు వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దీంతో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియక ఆయా పార్టీల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
 
ముఖ్యంగా, చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై రెప్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ రెచ్చిపోయారు. బూతు పురాణం లంఘించారు. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా... అంటూ హెచ్చరించారు. 
 
ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెంథిల్ మాట్లాడుతున్నంత సేపు రెడ్డెప్ప సహా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతేకాదు ఇంకా చాలా బూతులే సెంథిల్ మాట్లాడారు. ఇన్నేసి మాటలు మాట్లాడినప్పటికీ స్టేజ్‌పై ఉన్న నేతలంతా ఆయన్ను ఎంకరేజ్ చేశారో కానీ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

బాలకృష్ణ గారిలా తొడగట్టి K-ర్యాంప్ విజయం అని చెప్పాం : రాజేశ్ దండ, శివ బొమ్మకు

Nayanatara: మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్

'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)

సిద్ధు గారూ, మీరు నిజ జీవితంలో ఉమనైజరా?: లేడీ జర్నలిస్ట్ ప్రశ్న, ఎక్కడికి పోతున్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం