Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారు.. ఆయన్నే గౌరవిస్తా : మాజీ మంత్రి బాలినేని

Webdunia
మంగళవారం, 16 మే 2023 (12:25 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని, అదేసమయంలో మనం కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్మించిన వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బాలినేని మాట్లాడారు. 'నాకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చింది ఒంగోలు. రానున్న ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తా' అని బాలినేని స్పష్టం చేశారు.

'నాకు అయినవాళ్లు.. కాని వాళ్లంటూ ఎవరూ లేరు. కావాల్సింది కార్యకర్తలు. వారి కోసం మా నాయకుడు జగన్‌ని తప్ప ఎవరినీ లెక్క చేయను. మార్కాపురం, గిద్దలూరు, దర్శి నుంచి పోటీ చేస్తానంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

పార్టీలో అయిన వాళ్లే కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నందుకు ఇటీవల బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అటువంటి వారిని లెక్క చేయాల్సిన అవసరం లేదనిపించింది. కార్యకర్తలు ఇప్పటికి ఐదుసార్లు గెలిపించారు. వారి రుణం తీర్చుకుంటాను' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments