Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో వైకాపా నేత దారుణ హత్య.. కత్తితో నరికి చంపేశారు..

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో అధికార వైకాపాకు చెందిన నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన పేరు రామశేషు. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈయనను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కత్తితో నరికి చంపేశారు. ఈయనపై గత 2017లో ఓసారి హత్యాయత్నం జరిగింది. ఈయన ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున దుండగులు పక్కా ప్లాన్‌తో హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని గార మండల శ్రీకూర్మం గ్యాస్ గోదాము వద్ద జరిగింది. ఈయన స్థానికంగా గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దుండగులు హత్యకు ఉపయోగించిన కత్తులను సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. 
 
అయితే, దుండగులు మొబైల్ ఫోన్‌ను కూడా వదిలేసి వెళ్లడంతో ఇది ఖచ్చితంగా దొంగల పని కాదని పోలీసులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యావహారాలు, వివాహేతర సంబంధాల కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ హత్యలో ముగ్గురు దుండగులు పాల్గొనివుండొచ్చని అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments