Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ఘోర పరాజయం: పదవీ బాధ్యతల నుంచి సజ్జల ఔట్?

ఐవీఆర్
శనివారం, 8 జూన్ 2024 (18:41 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి కారణాలను నాయకులు తలోరకంగా స్పందిస్తున్నారు. కొందరు వాలంటీర్ల వల్ల నాయకులకి- ప్రజలకి మధ్య సంబంధం తెగిపోయిందనీ, అందువల్ల పరాజయం పాలయ్యామని విశ్లేషిస్తున్నారు.
 
మరికొందరైతే... ముఖ్యమంత్రి చుట్టూ ఓ కోటరీ ఏర్పడిందనీ, ఆ వలయాన్ని ఛేదించుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వెళ్లలేకపోయారనీ, నియోజకవర్గ సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ చుట్టూ కోటరీ అంటే... వారిలో సజ్జల రామకృష్ణా రెడ్డి ముందు వరసలో వుంటారు. కనుక ఈయన వల్ల పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
 
ఇంకోవైపు... నియోజకవర్గాలకు సంబంధించి ఏ పనులు కావాలన్నా గంటల తరబడి సీఎంఓ దగ్గర వేచి చూడాల్సిన పరిస్థితి వుండేదనీ, ఉదయం వెళితే రాత్రి వరకూ పని అయ్యేది కాదని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితులతో పాటు నియోజకవర్గ సమస్యలను చెప్పుకునే సమయం కూడా జగన్ వద్ద లేకుండా పోయిందంటూ చెపుతున్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనే భావన వైసిపి నాయకుల్లో నాటుకుని వుంది. అందువల్ల ఆయనను పదవీ బాధ్యతల నుంచి తప్పించాలని వైసిపి అధినాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments