Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (09:16 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కీలక ప్రకటన చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. 
 
ఇటీవల ఎమ్మిగనూరులోని ఉప్పర సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని సీఎం జగన్ కోరారని, కానీ, తన వయసు 83 యేళ్లు అని, గుండె జబ్బు కూడా ఉందని గుర్తుచేసి పోటీ చేయలేనని చెప్పినట్టు తెలిపారు. 
 
పైగా, తాను ప్రజలతో కలిసి ఎక్కువ సేపు తిరగలేనని, ఎక్కువ సేపు మాట్లాడలేనని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, అసెంబ్లీ టిక్కెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఒకవేళ తన కొడుక్కి టిక్కెట్ వస్తే ప్రజలంతా సహకరించి గెలిపించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments