వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (09:16 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కీలక ప్రకటన చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. 
 
ఇటీవల ఎమ్మిగనూరులోని ఉప్పర సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని సీఎం జగన్ కోరారని, కానీ, తన వయసు 83 యేళ్లు అని, గుండె జబ్బు కూడా ఉందని గుర్తుచేసి పోటీ చేయలేనని చెప్పినట్టు తెలిపారు. 
 
పైగా, తాను ప్రజలతో కలిసి ఎక్కువ సేపు తిరగలేనని, ఎక్కువ సేపు మాట్లాడలేనని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, అసెంబ్లీ టిక్కెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఒకవేళ తన కొడుక్కి టిక్కెట్ వస్తే ప్రజలంతా సహకరించి గెలిపించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments