పార్టీ అధినేత జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి : వైకాపా ఎంపీ

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (11:39 IST)
తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాజద్రోహం కేసు పెట్టాలంటూ ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా జగన్‌ ప్రభుత్వం లబ్ధిపొందుతోంది. అయినప్పటికీ సీఎం జగన్‌రెడ్డి తన రాజకీయ లబ్ధికోసం కేంద్రాన్ని బలిపశువు చేయడానికి చూస్తున్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అందుకు సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి' అంటూ ఆయన డిమాండ్ చే్శారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను ఎత్తిచూపిన నేరానికి నాపై గతంలో రాజద్రోహం కేసు పెట్టి హింసించలేదా? ఇపుడు జగన్‌ ప్రభుత్వం కూడా అదేపని చేస్తున్నప్పుడు రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌పై రోడ్ల అభివృద్ధి పేరుతో సెస్‌ వసూలు చేసిన్నా వాటి కోసం ఒక్క పైసా కూడ ఖర్చుచేయడం లేదని ఆరోపించారు. 
 
విద్యుత్‌ కొనుగోలులో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ వివరణాత్మక ఆరోపణలు చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలో చేసుకున్న ఒప్పందం వెనుక చక్రం తిప్పిన వ్యక్తి ఎవరని నిదీశారు. అమరావతి రైతులకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. రైతుల పాదయాత్రను అడ్డుకోడానికి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడం విచారకరమని రఘురామరాజు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments