Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ చేయూత.. అర్హతలు ఇవే.. అకౌంట్లోకి రూ.18,750వేలు

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (17:08 IST)
45 ఏళ్లు నిండిన మహిళలకు 'వైఎస్సార్‌ చేయూత' పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కారు సిద్ధం అవుతోంది.   ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులు. ఒక్కొక్కరికి రూ.18,750లను అర్హులకు అందజేస్తారు.
 
ప్రస్తుతం అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పేర్ల నమోదుకు క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్, ఆధార్‌ తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45-60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తోంది. సెప్టెంబర్‌ 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దరఖాస్తులపై సెప్టెంబర్ 8 లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు.
 
చేయూత పథకం ద్వారా 2020 ఆగస్టులో.. తొలి విడత కింద 24,00,111 మందికి రూ.4,500.21 కోట్లు.. 2022 జూన్‌ 22న రెండో విడతగా 24,95,714 మందికి రూ.4,679.49 కోట్లు అకౌంట్‌లలో జమ చేశారు. మూడో విడతగా సెప్టెంబర్‌లో లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున అకౌంట్‌లో జమ చేస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments