Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ జయంతి : ఇడుపులపాయలో వైఎస్ ఫ్యామిలీ నివాళులు

Webdunia
గురువారం, 8 జులై 2021 (09:01 IST)
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కూతురు షర్మిల, భార్య విజయమ్మ నివాళులర్పించారు. షర్మిల వెంట వైఎస్ వివేకా కమార్తె సునీత వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. అలాగే, కడప ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో షర్మిల హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. 
 
తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావానికి అంతా సిద్ధమైంది. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో షర్మిల తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. 
 
షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న సంగతి తెలిసిందే. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండానూ షర్మిల ఆవిష్కరించనున్నారు. 
 
మరోవైపు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా తొలిసారిగా సీఎం జగన్ సాయంత్రం వేళలో ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. 
 
అయితే ఇలా చేయడం సాంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధమని పెద్దలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జయంతి వేడుకల్లో  సమయవేళ మార్పు కోసం అన్నాచెల్లెల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. షర్మిళ ఉదయం సమయం మార్పు కోసం ఒప్పుకోకపోవడంతోనే సీఎం జగన్ సాయంత్రం షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments