Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు.. శంకర్ రెడ్డి అరెస్ట్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (20:16 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా దేవి రెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు.
 
హైదరాబాద్‌‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. అరెస్ట్‌ చేసిన అనంతరం… దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు.
 
కాగా మూడు రోజుల కింద ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి డ్రైవర్‌ దస్తగిరి సిబిఐ అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక విషయాలను తెలిపాడు దస్తగిరి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి కారణమని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments