Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ కస్టడీలోకి వైఎస్ భాస్కర్ రెడ్డి - ఉదయ కుమార్ రెడ్డి

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (13:10 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు అయిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం మేరకు సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఇద్దరినీ ఆరు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు బుధవారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకుని, సాయంత్రం ఐదు గంటల వరకు వీరి వద్ద విచారణ జరుపనున్నారు. 
 
మరోవైపు, బుధవారం ఉదయం ఉదయ్ కుమార్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునే ముందు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనతో పాటు భాస్కర్ రెడ్డిని కూడా ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత వీరిద్దరిని విచారణ కోసం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. 
 
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే కోఠి సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. భాస్కర్ రెడ్డి, ఉదయం కుమార్ రెడ్డిలను కలిపి విచారిస్తామని సీబీఐ అధికారులు ఇప్పటికే చెప్పిన విషయం తెల్సిందే. ఇపుడు అవినాష్ రెడ్డి కూడా అక్కడ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments