Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప వైకాపా ఎంపీ అవినాశ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (15:46 IST)
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైపాకాకు చెందిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేయగా, బుధవారం మరోమారు జారీచేసింది. జనవరి 28వ తేదీన తర్వాత తమ హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని తాజా నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 
 
కాగా, వివేకా హత్య కేసును సీబీఐ గత మూడున్నరేళ్లుగా హత్య చేస్తుంది. గత 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ ప్రధానంగా అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో వీరిద్దరినీ ఇప్పటివరకు సీబీఐ విచారించలేదు. 
 
ఈ పరిస్థితుల్లో తొలిసారి ఆయనకు విచారణకు రావాల్సిందిగా మూడు రోజుల క్రితం సీబీఐ ఆదేశాలు జారీచేసింది. అయితే నోటీసుల ఇచ్చిన వెంటనే విచారణకు రావాలంటే ఎలా అని అవినాశ్ మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో సీబీఐ ఈ దఫా 28వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొంటూ తాజాగా నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments