Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ జయంతి రోజున వైఎస్.షర్మిల కొత్త పార్టీ!

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:12 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ స్థాపన తథ్యమైపోయింది. తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించనుంది. ఈ పార్టీ స్థాపనకు కూడా ముహుర్తాలను కూడా ఆమె ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం రెండు తేదీలను ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వీటిలో ఒకటి మే 14వ తేదీ కాగా, మరొకటి జూలై 8వ తేది. ఈ రెండు తేదీలకు ఓ ప్రత్యేకత ఉంది. వైఎస్. షర్మిల తండ్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో తేదీ అయిన జూలై 8.. వైఎస్ఆర్ జయంతి. ఈ రెండు తేదీల్లో ఒక తేదీన కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ప్రజల గుండెల్లో చెరగిపోని స్థానాన్ని వైఎస్ఆర్ సంపాదించుకున్నారు. దీంతో ఆయన జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. దీంతో వైఎస్ఆర్ జయంతి రోజునే పార్టీ వ్యవస్థాపక తేదీగా షర్మిల ఎంచుకున్నట్టు ఆమె సన్నిహితుల మాటగావుంది. 
 
కాగా, షర్మిల ఇప్పటికే పార్టీ ఏర్పాటు అంశంపై వివిధ జిల్లాలకు చెందిన నేతలతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అలాగే, ఒక్కో జిల్లాలో ఈ తరహా సమావేశాలు నిర్వహించి, స్థానిక నేతలు ఇచ్చే సూచనలు, సలహాలతో పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments