Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్టింట వైరల్ అవుతున్న వైఎస్‌ షర్మిల తనయుడి వివాహ ఫోటోలు

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (10:42 IST)
Raja Reddy marriage
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం శనివారం సాయంత్రం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. 
 
వివాహ వేడుకలో భాగంగా జరిగిన ‘హల్దీ’ వేడుక ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో కొత్త జంట రాజా రెడ్డి-ప్రియ, వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కుమార్తె అంజలి, వధువు అట్లూరి ప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కనిపించారు.
 
ఈ సందర్భంగా రాజా రెడ్డి, ప్రియ సొగసైన తెల్లటి సాంప్రదాయ దుస్తులను ధరించారు. రాజా రెడ్డి తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, ప్రియ తెల్లటి లెహంగాలో అందంగా కనిపించింది. వారి చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
అయితే వైఎస్ షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజారెడ్డి, ప్రియల వివాహ వేడుకకు హాజరుకాలేదు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ అనివార్య కారణాల వల్ల ఏపీ సీఎం హాజరుకాలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Raja Reddy marriage
 
ఫిబ్రవరి 16న ప్రారంభమైన మూడు రోజుల వివాహ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. ఇప్పటికే సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments