నెట్టింట వైరల్ అవుతున్న వైఎస్‌ షర్మిల తనయుడి వివాహ ఫోటోలు

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (10:42 IST)
Raja Reddy marriage
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం శనివారం సాయంత్రం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. 
 
వివాహ వేడుకలో భాగంగా జరిగిన ‘హల్దీ’ వేడుక ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో కొత్త జంట రాజా రెడ్డి-ప్రియ, వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కుమార్తె అంజలి, వధువు అట్లూరి ప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కనిపించారు.
 
ఈ సందర్భంగా రాజా రెడ్డి, ప్రియ సొగసైన తెల్లటి సాంప్రదాయ దుస్తులను ధరించారు. రాజా రెడ్డి తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, ప్రియ తెల్లటి లెహంగాలో అందంగా కనిపించింది. వారి చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
అయితే వైఎస్ షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజారెడ్డి, ప్రియల వివాహ వేడుకకు హాజరుకాలేదు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ అనివార్య కారణాల వల్ల ఏపీ సీఎం హాజరుకాలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Raja Reddy marriage
 
ఫిబ్రవరి 16న ప్రారంభమైన మూడు రోజుల వివాహ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. ఇప్పటికే సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments