Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అన్న జగన్ మానసికస్థితి భయంగా ఉంది .. అందుకే అద్దం పంపుతున్నా : వైఎస్ షర్మిల

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (17:57 IST)
తన అన్న, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తాను ఆడుతున్నానంటూ అన్న జగన్ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. పైగా, మా అన్న జగన్ మానసికస్థితిని చూస్తే భయమేస్తుందని వ్యాఖ్యానించారు. తన అన్న జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందంట, అందుకే ఆయనకు ఓ అద్దాన్ని పంపుతున్నట్టు చెప్పారు. 
 
ఆమె శనివారం కడపలో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో తాను చేతులు కలిపానని, చంద్రబాబు చెప్పినట్టుగా తాను ఆడుతున్నానని, తన రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉందంటూ జగన్ పదేపదే అంటున్నారని, ఎలాంటి ఆధారాలతో ఇలాంటి ప్రచారం చేస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. పైగా, చంద్రబాబుతో ఈ వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ వారసురాలు చేతులు కలిపిందని నిరూపించగలరా అని ఆమె సవాల్ విసిరారు. 
 
చంద్రబాబు చెబితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని అంటున్నారు. మరి ఆ నాడు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా, సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మాట వింటారని చెబుతున్నారు. చంద్రబాబు ఎంతో పవర్ ఫుల్ అని చెబుతున్నారు. ఏం జరిగినా చంద్రబాబే కారణమని అంటున్నారు. జగన్‌‍కు చంద్రబాబు పిచ్చిపట్టుకుంది అని షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments