Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్టలను కొట్టడం.. పోర్టులను అమ్మడం.. భూములను మింగడం.. ఇదే విశాఖపై జగన్ విజన్ : షర్మిల ఫైర్

ఠాగూర్
బుధవారం, 6 మార్చి 2024 (15:31 IST)
తన సొంత అన్న, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి వైజాగ్‌లో కాపురం పెడతానని, విశాఖలోనే మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని విశాఖ వేదికగా జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో జగన్ చెప్పారు. అలాగే, విజన్ వైజాగ్ పేరుతో ఓ డూక్యుమెంటరీని రిలీజ్ చేశారు. దీనిపై వైఎస్ షర్మిల తీవ స్థాయిలో మండిపడ్డారు. పరిపాలన రాజధానిలో పాలన మొదలుపెట్టడానికి ఇన్నాళ్లు ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. 
 
పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అంటూ మండిపడ్డారు. ఐటీ హిల్స్‌ నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా జారుకోవడం మీ రోడ్ మ్యాప్ అని అన్నారు. ఆంధ్రుల తలమానికమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం అమ్మెస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించడం మీ విజన్ అంటూ దుయ్యబట్టారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ అని అన్నారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మేయడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైకాపా విజన్ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇపుడు ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారని ఆమె ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments