Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (13:48 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాకు మహా అయితే, 25 సీట్లకు మించి రావని ఉండి అసెంబ్లీ స్థానం అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందంటూ ప్రచారం సాగుతుంది. మరోవైపు, అధికార పార్టీ మాత్రం తమకు అనుకూల ఓటింగ్‌గా ప్రచారం చేసుకుంటుంది. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, జూన్ 4వ తేదీన వెలువడబోయే ఎన్నికల ఫలితాలతో జగన్ ఆశలు గల్లంతవుతాయని చెప్పారు. వైకాపాకు కనీసం 25 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. 
 
ఇదిలావుంటే, గురువారం ఐప్యాక్ ప్రతినిధులను సీఎం జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన చరిత్ర సృష్టించబోతున్నాం. గత ఎన్నికలకు మించిన ఫలితాలు రానున్నాయి. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకున్నాం. ఈ దఫా అంతకన్నా ఎక్కువ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తుందని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్న సీట్లు వైకాపాకు వస్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలకు రఘురామకృష్ణంరాజు కౌంటర్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments