Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (13:48 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాకు మహా అయితే, 25 సీట్లకు మించి రావని ఉండి అసెంబ్లీ స్థానం అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందంటూ ప్రచారం సాగుతుంది. మరోవైపు, అధికార పార్టీ మాత్రం తమకు అనుకూల ఓటింగ్‌గా ప్రచారం చేసుకుంటుంది. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, జూన్ 4వ తేదీన వెలువడబోయే ఎన్నికల ఫలితాలతో జగన్ ఆశలు గల్లంతవుతాయని చెప్పారు. వైకాపాకు కనీసం 25 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. 
 
ఇదిలావుంటే, గురువారం ఐప్యాక్ ప్రతినిధులను సీఎం జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన చరిత్ర సృష్టించబోతున్నాం. గత ఎన్నికలకు మించిన ఫలితాలు రానున్నాయి. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకున్నాం. ఈ దఫా అంతకన్నా ఎక్కువ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తుందని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్న సీట్లు వైకాపాకు వస్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలకు రఘురామకృష్ణంరాజు కౌంటర్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments