Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని అనేక ప్రాంతాలు చాలా మేరకు నీటి మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 
 
ఇదిలావుంటే, ఈ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ముంపు బాధితులను తక్షణం సహాయక పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. అలాగే, సహాయ చర్యల్లో ఎక్కడా రాజీలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయినట్టు కలెక్టర్లకు వెల్లడించారు. 
 
ముఖ్యంగా వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. వర్షాల తర్వాత కూడా సీజనల్ వ్యాధులతో అంటు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వరదల కారణంగా ప్రజా రవాణా స్తంభించిన నేపథ్యంలో ప్రత్యామ్నయ సౌకర్యాలు చూసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments