ఏపీలో వరద నీటిలో చిక్కున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (13:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు, ఉప నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో రెండు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు నది పోటెత్తింది. దీంతో ఈ రెండు బస్సులు వరద నీటిలో చిక్కుకునిపోయాయి. 
 
ఒక్కసారిగా వరద నీటి ప్రవాహం పెరగడంతో వాగులో చిక్కుకుని పోయాయి. ఈ రెండు బస్సుల్లో కలిపి సుమారుగా 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు టాపెక్కి కూర్చొన్నారు. వీరిని రక్షించేందుకు వరద విపత్తుల సహాయక సిబ్బంది ప్రయత్నిస్తుంది. 
 
మరోవైపు, ఈ భారీ వర్షం కారణంగా వచ్చిన వరద నీటి ప్రవాహానికి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకునిపోయింది. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి, అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments