Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వరద నీటిలో చిక్కున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (13:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు, ఉప నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో రెండు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు నది పోటెత్తింది. దీంతో ఈ రెండు బస్సులు వరద నీటిలో చిక్కుకునిపోయాయి. 
 
ఒక్కసారిగా వరద నీటి ప్రవాహం పెరగడంతో వాగులో చిక్కుకుని పోయాయి. ఈ రెండు బస్సుల్లో కలిపి సుమారుగా 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు టాపెక్కి కూర్చొన్నారు. వీరిని రక్షించేందుకు వరద విపత్తుల సహాయక సిబ్బంది ప్రయత్నిస్తుంది. 
 
మరోవైపు, ఈ భారీ వర్షం కారణంగా వచ్చిన వరద నీటి ప్రవాహానికి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకునిపోయింది. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి, అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments