Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (14:51 IST)
ఏపీలోని పోలీసులకు, అధికారులకు వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టివార్నింగ్ ఇచ్చారు. ఈ తెలుగు దేశం పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదని, రేపు మా ప్రభుత్వం వస్తే అన్యాయం చేసిన ప్రతి పోలీసునీ, అధికారులను బట్టలూడదీసి నిలబెడతామని ఆయన హెచ్చరించారు. 
 
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షులను కిడ్నాప్ చేసినందుకు వైకాపా నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉంటున్నారు. వంశీని మంగళవారం ములాఖత్‌లో మాజీ సీఎం జగన్ కలిసి పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 
 
తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమన్నారు. నాడు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా, అందులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అదే సత్యవర్థన్ న్యాయమూర్తి వద్ద వాంగ్మూలం ఇస్తూ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు. అయినప్పటికీ వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టందని ఆరోపించారు. 
 
అప్పట్లో చేసిన ఫిర్యాదులో వల్లభనేని వంశీ పేరు లేదని గుర్తు చేశారు. ఎందుకంటే దాడి జరిగిన సమయంలో వంశీ అక్కడ లేరని జగన్ చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వల్లభనేని వంశీని టార్గెట్ చేశారని జగన్ ఆరోపించారు. ఎలాగైనా వంశీని ఇరికించాలనే కుట్రతో టీడీపీ ఆఫీసుపై దాడి కేసును రీఓపెన్ చేసి వంశీని 71వ నిందితుడిగా చేర్చారని తెలిపారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments