Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్బాబు.. ప్లీజ్ పార్టీ మారొద్దు.. మీ బలంవల్లే ఢిల్లీలో నాకు గౌరవం : పార్టీ నేతలతో జగన్ కామెంట్స్

ఠాగూర్
శనివారం, 31 ఆగస్టు 2024 (09:25 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చావుదెబ్బ తగిలింది. ఈ ఓటమి నుంచి ఆ పార్టీ నేతలు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు. పైగా, ఇక వైకాపాలో భవిష్యతే లేదనే నిర్ణయానికి వస్తున్నారు. ఏపీలో ఏర్పాటైన టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వ పాలన బాగుందంటూ ప్రజల నుంచి సానుకూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటివారిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులుగా ఉన్న వారు కావడం గమనార్హం. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమతమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరిలో కొందరు టీడీపీలో చేరగా మరికొందరు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైంది. ముఖ్యంగా, రాజ్యసభకు ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు రాజీనామా చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
అలాగే, తనకు సన్నిహితులుగా ఉన్న ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌, గొల్ల బాబూరావుతో పాటు మేడా రఘునాథరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య కూడా రాజీనామాలు చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. దీంతో కలతచెందిన మాజీ సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి, వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీని, తనను వదిలిపోవద్దని అభ్యర్థించారు. రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం వల్లే ఢిల్లీలో తనను గౌరవిస్తున్నారని.. మీరు రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికల్లో ఆ పదవులన్నీ టీడీపీకి వెళ్లిపోతాయని చెప్పారు. రాజీనామా చేయడం తనకు వెన్నుపోటు పొడవడమేనని నిష్ఠూరం ఆడినట్లు సమాచారం. 
 
ఈ బుజ్జగింపుల ప్రభావమో ఏమో.. అయోధ్యరామి రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్‌ ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తాము జీవితాంతం జగన్‌ వెంటే ఉంటామంటూ ప్రకటించారు. తనకు వ్యక్తిగతంగా నష్టాలు, కష్టాలూ ఉన్నా వైసీపీని వీడడం లేదని.. రాజ్యసభకు రాజీనామా చేయడం లేదని అయోధ్యరామి రెడ్డి చెప్పారు. గొల్ల బాబూరావు, రఘునాథరెడ్డి కూడా పార్టీని వదిలివెళ్లరని ఆయన చెప్పారు. మీడియాకు ఈ విషయం చెప్పాలని జగన్‌ సూచించారని బోస్‌ వెల్లడించారు. తాము రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవులు టీడీపీకి వెళ్లిపోతాయని.. అది ఒక విధంగా జగన్‌కు వెన్నుపోటు పొడవడంతో సమానంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments