Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌ను ఆర్కే రోజా అన్‌ఫాలో కాలేదు.. జగన్‌ను ఇప్పటికీ అన్నగానే..?

Advertiesment
Roja selvamani

సెల్వి

, గురువారం, 29 ఆగస్టు 2024 (16:49 IST)
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా వైకాపాకు బైబై చెప్పాలనుకుంటున్నారని సమాచారం. ఇక వైకాపాతో సంబంధాలు వద్దనుకునేందుకు రోజా సిద్ధమయ్యారని సమాచారం. రోజా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీనీ, జగన్‌ను అన్ ఫాలో అయ్యారని టాక్ వస్తోంది.
 
రోజా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో జగన్‌తో ఉన్న ఫోటో తొలిగించటంతో ఇక వైసీపీకి రాజీనామా ఖాయమనే ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని రోజా జగన్‌ను అన్ ఫాలో కాలేదు. సోషల్ మీడియాలో రోజా జగన్‌ను ఫాలో అవుతున్నారు. 
 
రోజా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో జగన్‌తో ఉన్న ఫోటో తొలిగించటంతో ఇక వైసీపీకి రాజీనామా ఖాయమనే ప్రచారం ప్రారంభమైంది. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా వ్యవహరించిన రోజా ఇప్పుడు ఈ స్థాయిలో తాను వైసీపీ వీడుతున్నారంటూ ప్రచారం సాగుతున్న వేళ మౌనంగా ఉంటున్నారు. 
 
ఎక్కడా ఈ వార్తలను ఖండించలేదు. సోషల్ మీడియా ద్వారానూ స్పందించలేదు. అయితే, ఈ ప్రచారం వేళ రోజా ఈ రోజున చేసిన ట్వీట్ అన్నింటికీ సమాధానంగా భావిస్తున్నారు. 
 
మాజీ సీఎం జగన్‌, భారతిలకు ట్విట్టర్‌ వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ ద్వారా తాను జగన్‌ను ఇప్పటికీ అన్నగానే భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రిగానూ పని చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలులో రాజభోగాల ఎఫెక్ట్... బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు