Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల్లో వైకాపాకు చావుదెబ్బ... ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా!

pothula suneetha

ఠాగూర్

, బుధవారం, 28 ఆగస్టు 2024 (17:40 IST)
గత మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చావుదెబ్బ తగిలింది. ఈ ఓటమిని వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అనేక మంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి టాటా చెప్పగా, ఇపుడు రాజ్యసభ సభ్యుడు, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మోపిదేవి వెంకట రమణ కూడా పార్టీని వీడినున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు శాసనమండలికి పంపించారు. 
 
కాగా, పోతుల సునీత ఏ పార్టీలో చేరేది తెలియరాలేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆమె వెల్లడించారు. పోతుల సునీత వైకాపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న విషయం తెల్సిందే. అలాంటి మహిళ నేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
వైకాపా షాకివ్వనున్న మోపిదేవి వెంకటరమణ? 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైకాపా చిత్తుగా ఓడిపోయింది. వైకాపా బాపట్ల నియోజకవర్గం ఇన్‌‍చార్జిగా ఉన్న రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఇపుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఓ నిందితుడుగా ఉంటూ, కొన్ని నెలల పాటు జైలు జీవితం కూడా గడిపిన మోపిదేవి వెంకట రమణ ఇపుడు వైకాపా అధికారం కోల్పోవడంతో తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
వైకాపా అధికారంలో కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వీరిలో కొందరు రాజీనామా చేయగా, మరికొందరు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు వైకాపాకు టాటా చెప్పేశారు. ఇపుడు మోపిదేవి వెంకట రమణ వంతు వచ్చినట్టుంది. ఆయన త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా, నమ్మిన బంటుగా ఉన్న మోపిదేవి... పార్టీని వీడనున్నారనే వార్తలతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి. ఆయన త్వరలో టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా మోపిదేవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గదుల్లో అమర్చిన స్పై కెమెరాలు.. కపుల్స్ సన్నిహిత వీడియోలను..?