Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు తండ్రి కేబినెట్‌లో నేడు కొడుకు మంత్రివర్గంలో...

Webdunia
ఆదివారం, 9 జూన్ 2019 (12:09 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా తనదైనశైలిలో ఆయన తన మంత్రివర్గం కూర్పు చేసుకున్నారు. మొత్తం 25 మంది మంత్రుల్లో ఆరుగురు మంత్రులు అందరికంటే అదృష్టవంతులని చెప్పాలి. 
 
ఆ ఆరుగురు మంత్రులు ఎవరో కాదు.. సీనియర్ నేతలైన పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశ్వరూప్, బాలినేని శ్రీనివాస రెడ్డిలు జగన్ తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో కూడా పని చేశారు. వీరంతా ఇపుడ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. పైగా, వీరికి అత్యంత కీలక శాఖలను ముఖ్యమంత్రి జగన్ కేటాయించడం గమనార్హం. 
 
వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించగా, బొత్సకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను, మోపిదేవి వెంకటరమణకు మత్స్య, పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్ శాఖలను కేటాయించారు. 
 
అలాగే, పినిసె విశ్వరూప్‌కు సాంఘిక సంక్షేమ శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖలు, బాలినేని శ్రీనివాసరెడ్డికి విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments