Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా? సీఎం జగన్

Webdunia
బుధవారం, 10 జులై 2019 (13:47 IST)
దేశానికి అన్నం పెట్టాల్సిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కులేని వారిగా మారిన కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. పైగా, ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వం, ఆ దిశగానే తమ పాలన సాగుతుందన్నారు.
 
ఆయన బుధవారం కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. 
 
గత ప్రభుత్వంలో చనిపోయిన రైతులను గుర్తించని వారు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. చనిపోయిన రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు నేరుగా వెళ్లి ఆయా కుటుంబాలకు అందించాలని కోరారు.
 
నిజానికి గత ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చినట్టు లేదని, అందువల్ల అలాంటి రైతులను గుర్తించి, 2014-19 మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సభ్యులకు ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్ళలో డీసీఆర్‌బీ లెక్కల ప్రకారం 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments