మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా? సీఎం జగన్

Webdunia
బుధవారం, 10 జులై 2019 (13:47 IST)
దేశానికి అన్నం పెట్టాల్సిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కులేని వారిగా మారిన కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. పైగా, ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వం, ఆ దిశగానే తమ పాలన సాగుతుందన్నారు.
 
ఆయన బుధవారం కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. 
 
గత ప్రభుత్వంలో చనిపోయిన రైతులను గుర్తించని వారు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. చనిపోయిన రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు నేరుగా వెళ్లి ఆయా కుటుంబాలకు అందించాలని కోరారు.
 
నిజానికి గత ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చినట్టు లేదని, అందువల్ల అలాంటి రైతులను గుర్తించి, 2014-19 మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సభ్యులకు ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్ళలో డీసీఆర్‌బీ లెక్కల ప్రకారం 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments