Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీకి జగన్ వచ్చారు.. వెళ్లారు.. మరో 3 నెలలు సభ్యత్వం సేఫ్!!

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (12:33 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజున వైకాపా అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభకు వచ్చారు. సభలోకి అడుగుపెట్టే ముందు అసెంబ్లీ హాజరుపట్టికలో వారు సంతకం చేశారు. అంటే సభకు వచ్చినట్టుగా హాజరు వేయించుకున్నారు. దీంతో మరో 60 రోజుల పాటు వారు సభకు రాకుండానే కాలం గడిపేయవచ్చు. 
 
సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు జగన్ తన పరివారంతో సభకు హాజరుకావడంతో మరో 60 రోజుల వరకు అటువైపు కన్నెత్తి చూడాల్సిన పరిస్థితి ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న భయంతోనే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సభకు వచ్చారని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, సభకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం 11 నిమిషాల్లోనే సభ నుంచి వాకౌట్ అయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగానే తన సభ్యులతో కలిసి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అది సాధ్యపడకపోవడంతో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments