Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు.. వైకాపా సభ్యుల తీరు మారదా?

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (11:27 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం చేపట్టిన వెంటనే వైకాపా సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, వైకాపాను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు చేశారు. అయితే, గవర్నర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 
 
ఆ తర్వాత వైకాపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత కేవలం 11 నిమిషాలు మాత్రమే వారు సభలో ఉన్నారు. ఆ తర్వాత సభ నుంచి వారు బయటకు వెళ్లిపోయారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సభలో కూటమి ప్రభుత్వ సభ్యులు మినహా మరెవ్వరూ లేరు. 
 
సభకు 60 రోజుల పాటు ఎలాంటి కారణం లేదా సమాచారం లేకుండా రాకుంటే అనర్హత వేటు పడుతుందని రాజ్యాంగ నిపుణులు పదేపదే హెచ్చరికలు చేశారు. దీంతో వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారంటూ కూటమి ప్రభుత్వ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments