Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ లాక్ 4.0.. వాయిదా పడిన జగనన్న విద్యాకానుక..

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (21:56 IST)
కరోనా కాలం లాక్ డౌన్ కారణంగా.. పలు కార్యక్రమాలు వాయిదా పడుతూ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. 
 
ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు తెరవొద్దని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జగనన్న విద్యాకానుకను కూడా స్కూళ్లు ప్రారంభించే సమయంలోనే అందించాలని నిర్ణయించింది.
 
అసలు ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 5 నుంచే ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తామని అనుకున్నామని పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. అదే రోజున.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 'జగనన్న విద్యా కానుక' అందిస్తామని అనుకున్నామని చెప్పారు. 
 
అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ - 19 అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 30 దాకా పాఠశాలలు తెరవకూడదని తెలిపింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేది నాటికి వాయిదా వేస్తున్నామని చినవీరభద్రుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments