Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు బెదిరింపులు - భద్రత పెంపు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (14:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా నేతలకు బెదిరింపులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 
 
ఇటీవల అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వైకాపా మంత్రులు అసభ్యంగా మాట్లాడారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు ఆందోళనకు దిగి నిరసనలు తెలుపుతున్నారు. అదేసమయంలో సోషల్ మీడియా వేదికగా వారికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. 
 
ఈ క్రమంలో మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్లతో పాటు అదనంగా 1+4 గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం అదనంగా కేటాయించింది. అంతేకాకుండా అదనంగా మరో భద్రతా వాహనాన్ని కూడా ప్రభుత్వం సమకూర్చింది. దీంతో 7+7 భద్రతగా ఉండనుంది.
 
అలాగే, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతకు అదనంగా 3+3 భద్రతగా పెంచింది. అంటే ఇకపై వీరికి 4+4 భద్రతగా ఉంటుంది. చంద్రబాబుపై వ్యాఖ్యలు అనంతరం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన బెదిరింపులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments