Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు బెదిరింపులు - భద్రత పెంపు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (14:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా నేతలకు బెదిరింపులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 
 
ఇటీవల అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వైకాపా మంత్రులు అసభ్యంగా మాట్లాడారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు ఆందోళనకు దిగి నిరసనలు తెలుపుతున్నారు. అదేసమయంలో సోషల్ మీడియా వేదికగా వారికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. 
 
ఈ క్రమంలో మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్లతో పాటు అదనంగా 1+4 గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం అదనంగా కేటాయించింది. అంతేకాకుండా అదనంగా మరో భద్రతా వాహనాన్ని కూడా ప్రభుత్వం సమకూర్చింది. దీంతో 7+7 భద్రతగా ఉండనుంది.
 
అలాగే, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతకు అదనంగా 3+3 భద్రతగా పెంచింది. అంటే ఇకపై వీరికి 4+4 భద్రతగా ఉంటుంది. చంద్రబాబుపై వ్యాఖ్యలు అనంతరం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన బెదిరింపులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments