Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడిపై వైసీపీ బ‌హిష్క‌ర‌ణ వేటు

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (11:03 IST)
Kothapalli
సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడిపై వైసీపీ బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింది. ఈ మేర‌కు వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం ప్ర‌క‌టించారు. 
 
ఈ క్ర‌మంలో కొత్త‌ప‌ల్లి పార్టీ నిబంధ‌నావ‌ళిని అతిక్ర‌మించార‌ని పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ జ‌గ‌న్‌కు నివేదించింది. ఈ నివేదిక‌ను ఆధారం చేసుకునే కొత్త‌ప‌ల్లిని పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.
 
కాగా 2024 ఎన్నిక‌ల్లో తాను న‌ర‌సాపురం నుంచి త‌ప్ప‌నిస‌రిగా పోటీ చేస్తాన‌ని మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు... త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వ్య‌క్తిగ‌త ఓటింగ్ ఉంద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. 
 
అంతేకాకుండా 2024 ఎన్నికల్లో ఏ పార్టీ త‌ర‌ఫున తాను పోటీ చేస్తాన‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌బోనంటూ కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇకపోతే.. గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా విజ‌యం సాధించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments