Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (19:42 IST)
కారుకి ముసుగేసి లోపల ఏసీ వేసుకుని మద్యం సేవించారు. అనంతరం మత్తులోకి జారుకున్నారు. కారులో ఆయిల్ అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది. మత్తులోకి పోయిన యువకులు ఊపిరాడక కారులోనే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తిరుపతిలోని తిరుచానూరు ప్రాంతంలో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతిలోని తిరుచానూరులో దిలీప్, వినయ్ అనే ఇద్దరు యువకులు మద్యం సేవించాలనుకున్నారు. ఐతే తాము మద్యం సేవించడాన్ని ఎవ్వరూ చూడకూడదని కారులో ఎక్కారు. ఐనప్పటికీ కారు అద్దల్లోంచి కనిపిస్తుండటంతో ఇద్దరూ కారు దిగి దానికి కవర్ వేసి కప్పేసారు. ఆ తర్వాత తిరిగి కారులోకి వెళ్లిపోయి ఏసీ ఆన్ చేసారు.
 
అనంతరం ఇద్దరూ పూటుగా మద్యం సేవించారు. మత్తులోకి జారుకున్నారు. కానీ అర్థరాత్రి దాటాక కారులో ఆయిల్ అయిపోవడంతో ఇంజిన్ ఆగిపోయింది. దీనితో పాటు ఏసీ కూడా ఆగిపోయి కారులో ఆక్సిజన్ లేకుండా పోయింది. ఫలితంగా వీరిద్దరూ గాలి ఆడక కారులోనే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranga Sudha: ట్విట్టర్‌లో అలాంటి ఫోటోలు వైరల్.. పంజాగుట్ట స్టేషన్‌లో కంప్లైంట్

నందమూరి బాలకృష్ణ ఎన్ఎస్ఈలో బెల్ మోగించిన తొలి స్టార్‌గా చరిత్ర సృష్టించారు

భద్రకాళి చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది : తృప్తి రవీంద్ర, రియా జిత్తు

కిష్కింధపురి కథకి స్ఫూర్తి రామాయణం : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి

Ram: రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి పప్పీ షేమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments