Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు.. ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడు...

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు బావిలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జనగామ జిల్లా జాఫర్ గడ్‌లో ఉప్పుగల్లు గ్రామంలో నివాసం ఉంటున్న కేసోజు రాజేష్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతిని బలవంతంగా ఊరి చివర ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో అత్యాచార ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో ఆమెను పక్కనే ఉన్న బావిలోకి నెట్టే క్రమంలో తానూ పడిపోయాడు. బావిలో పడ్డ యువతి కేకలు వేస్తుండటంతో స్థానికులు వచ్చి ఆమెను బయటకు తీశారు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించి, రాజేష్‌ను పోలీసులకు అప్పగించారు. యువతి, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  వర్దన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments